ఛీటింగ్: కేరళ వ్యక్తి అరెస్ట్
- June 22, 2018కేరళ పోలీస్, ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖతార్ రాయల్ ఫ్యామిలీని 5.6 కోట్ల మొత్తానికి చీటింగ్ చేసినట్లు ఇతనిపై అభియోగాలు మోపబడ్డాయి. ఖతార్ మ్యూజియం అథారిటీస్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు జూన్ 13న కేసు రిజిస్టర్ చేశామని పోలీసులు వివరించారు. రాయల్స్కి చెందిన ఇ-మెయిల్స్ని ఫేక్ చేసి, వాటి ద్వారా నిందితుడు తన ఖాతాలోకి డబ్బుల్ని తరలించుకున్నట్లు పోలీసులు గుర్తించి, ఆ అకౌంట్నఇ బ్లాక్ చేసి, నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ చీటింగ్లో మరికొంతమంది వుండి వుండొచ్చన్న అనుమానంతో కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సునీల్ మీనన్, త్రిస్సూర్కి చెందిన వ్యక్తి. ఛీటింగ్ ద్వారా సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని కారు కొనుగోలు చేసేందుకు, సుమారు 20 లక్షల్ని ఇతర అవసరాల కోసం వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం