మోదీని కలిసిన మంత్రి కేటిఆర్‌

- June 27, 2018 , by Maagulf
మోదీని కలిసిన మంత్రి కేటిఆర్‌

తెలంగాణ మంత్రి కేటిఆర్‌ బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ప్రధానిని కొరినట్లు చెప్పారు. ఐటిఐఆర్‌పై ప్రధానికి నివేదిక ఇచ్చినట్లు కేటీఆర్‌ చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదికి చెప్పామన్నారు. సెయిల్‌, సింగరేణి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే రాయితీలిస్తామని, కేంద్రం కాదనుకుంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరినట్లు కేటిఆర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com