ఒమన్‌ బోర్డర్‌లో ప్రయాణీకులకు ఆర్‌ఓపి సాయం

- July 02, 2018 , by Maagulf
ఒమన్‌ బోర్డర్‌లో ప్రయాణీకులకు ఆర్‌ఓపి సాయం

మస్కట్‌: ఒమన్‌ బోర్డర్‌ (హఫీట్‌ బోర్డర్‌)లో 52 మంది ప్రయాణీకులతో కూడిన బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, ఆ ప్రయాణీకులకు సహాయ సహకారాలు అందించినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. సలాలా, దోఫార్‌ వైపు వెళుతున్న బస్సు బ్రోక్‌ డౌన్‌ అయ్యిందనీ, హఫీత్‌ పోర్ట్‌కి చెందిన పోలీస్‌ గార్డ్స్‌, ఆ బస్సులోని ప్రయాణీకులకు అండగా నిలిచారనీ, బస్సుని రిపెయిర్‌ చేయడంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. ప్రయాణీకుల్లో ఎక్కువమంది మహిళలు, పిల్లలు వున్నారు. వీరంతా గల్ఫ్‌ జాతీయులే. రిపెయిర్‌ పూర్తయిన తర్వాత బస్సు దోఫార్‌కి పయనమైందని అధికారిక వర్గాలు తెలిపాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com