జూన్లో 18 శాతం పెరిగిన ప్యాసింజర్ ట్రాఫిక్
- July 11, 2018
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ ట్రాఫిక్ 18 శాతం పెరిగింది. 2017 జూన్లో 1,034,477 మంది ప్రయాణీకులు నమోదు కాగా, 2018 జూన్లో ఇది 1,222,449గా నమోదయ్యింది. 2017 జూన్తో పోల్చితే 2018 జూన్ నాటికి ప్రయాణీకుల ట్రాఫిక్ 505,653కి చేరుకుంది. 2017లో ప్రయాణీకుల ట్రాఫిక్ 417,337గా నమోదయ్యింది. డిపార్టింగ్ ప్రయాణీకులు 617,140 నుంచి 716,796కి పెరిగారని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఇమాద్ అల్ జలావి చెప్పారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మొత్తం విమానాల సంఖ్య 10,071గా నమోదయ్యింది. 2017 జూన్లో ఈ సంఖ్య 8,998.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!