సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 ప్రారంభం
- July 11, 2018మస్కట్: సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి. సలాలా మునిసిపాలిటీ రిక్రియేషనల్ సెంటర్లో ఈ టూరిజం ఫెస్టివల్ సందర్శకుల్ని అలరిస్తోంది. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఈ ఫెస్టివల్ని ఆస్వాదించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెల్లడించింది. జూన్ 21 నుంచి జులై 3 వరకు దోఫార్లో పర్యటించిన టూరిస్టుల సంఖ్య 52,017కి చేరుకుంది. గత ఏడాది ఇదే పీరియడ్లో 38,404 మంది టూరిస్టులు వచ్చారు. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది 35.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. సలాలాలో ప్రముఖ నగరమైన దోఫార్, ఖరీఫ్ సీజన్లో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. యాన్యువల్ ఖరీఫ్ ఫశ్రీస్టివల్లో సంప్రదాయ ప్రదర్శనలు, స్థానిక హ్యాండిక్రాఫ్ట్స్ని విక్రయించే స్టాల్స్, ఒమనీ కలినరీ డిలైట్స్ ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణలు. ఈ ఫెస్టివల్ కోసం ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు