ఇండియన్ బ్యాంకర్ యు.ఏ.ఈలో మృతి
- July 17, 2018
యు.ఏ.ఈ:వారం రోజులుగా కన్పించకుండా పోయిన బ్యాంక్ ఉద్యోగి మృతదేహం వెలుగు చూసింది. గుర్తు తెలియని మృతదేహంగా మార్చురీలో ఈ మృతదేహాన్ని భద్రపరచగా, సోషల్ వర్కర్స్, కమ్యూనిటీ గ్రూప్స్ మృతుడెవరన్నదాన్ని గుర్తించేందుకు ప్రయత్నించడం జరిగింది. కాగా, సోమవారం మధ్యాహ్నం మృతుడి సోదరుడు, తన సోదరుడి మృతదేహాన్ని గుర్తించడంతో అతని వివరాలు వెలుగు చూశాయి. అబుదబీలో భారతీయ వలసదారుడు జబర్ నివసిస్తున్నారు. ముస్సాఫ్పా ఇండస్ట్రియల్ ఏరియాలో అతని మృతదేహం కనుగొన్నారు. మృతుడు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన వ్యక్తి. తొమ్మిదేళ్ళుగా అబుదాబీలో నివాసముంటున్నాడీయన. ఎవరితోనూ తన సోదరుడికి గొడవలు లేవనీ, వారం రోజులుగా ఆయన కన్పించడంలేదని మృతుడి సోదరుడు మునీర్ చెప్పారు. మునీర్ కూడా, తన సోదరుడితోనే కలిసి అదే బ్యాంక్లో పనిచేస్తున్నాడు. మృతుడు జబార్కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతికి గల కారణాన్ని ఫోరెన్సిక్ పరీక్షలతో తెలుసుకోనున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్