ఇండియా:మార్కెట్లో పతంజలి కూరగాయలు

- July 17, 2018 , by Maagulf
ఇండియా:మార్కెట్లో పతంజలి కూరగాయలు

యోగాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాబా రాందేవ్.. పతంజలి ఉత్పత్తులతో అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చుకున్నారు. ఏ ఇంట్లో చూసినా పతంజలి ప్రోడక్ట్స్ దర్శనమిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో పతంజలి జీన్స్, టీషర్ట్స్ కూడా రాబోతున్నాయి. సిమ్ కార్డులంటూ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా కన్నేసింది పతంజలి సంస్థ. తాజాగా హానికారక ఎరువులు వేసి పండించకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి పండించే కూరగాయలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పతంజలి బఠానీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. మరి కొన్ని కూరగాయలు క్యారెట్, క్యాబేజీ, క్యాలీప్లవర్, మొక్కజొన్న వంటి వాటిని మార్కెట్లోకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు రాందేవ్. ఈ కొత్త వ్యాపారాల విస్తరణ కోసం 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com