10 దిర్హామ్లకే టిక్కెట్: దుబాయ్ ఎయిర్లైన్
- July 19, 2018దుబాయ్కి చెందిన ఎయిర్ లైన్ ఫ్లై దుబాయ్, సమ్మర్ నేపథ్యంలో స్పెషల్ ఫేర్స్ని అనౌన్స్ చేసింది. దుబాయ్ నుంచి వెళ్ళేందుకుగాను కనిష్టంగా 10 దిర్హామ్ల ఖర్చుతో టిక్కెట్లను ప్రకటించింది. అయితే ఈ అతి తక్కువ ధర పిల్లలకు మాత్రమే. జులై 19 నుంచి జులై 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఈ సమయంలో టిక్కెట్ కొనుగోలు చేసినవారికి ఆగస్ట్ 15 వరకు ప్రయాణించే వీలుంటుంది. జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ ఇటలీ తదిత డెస్టినేషన్స్ ఇందులో వున్నాయి. జోర్డాన్, ఇరాక్, జాంజిబార్ కూడా ఈ లిస్ట్లో వున్నాయి. ఈ ఆఫర్ పొందాలంటే అడల్ట్ రిటర్న్ టిక్కెట్ని ఎకానమీలో కొనుగోలు చేయాల్సి వుంటుంది. అడల్ట్ ఫుల్ ఫేర్ చెల్లించాక, చిన్నారులకు 10 దిర్హామ్లకే టిక్కెట్ని పొందవచ్చు. పన్నులు, సర్ఛార్జిలు దీనికి అదనం. పిల్లలు 3 నుంచి 12 ఏళ్ళ వయసువారైతేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దుబాయ్ నుంచి ఎకానమీ క్లాస్ ఫేర్స్కి మాత్రమే ఈ ఆఫర్ పరిమితం.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్