బ్రేకింగ్ : 82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత..
- July 20, 2018
82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలకు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని ముంబైలోని జేజే హాస్పిటల్ కు తరలించారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అస్వస్థతకు గురై ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్వర్థన్ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. అయితే ఈ వ్యాధి ఇతరఖైదీలకు రాకుండా అందరికి మందులు అందజేశామన్నారు.కాగా మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!