తెలంగాణ టూరిజం ఆకర్షణలు
- July 25, 2018
హైదరాబాద్: ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లోని జలపాతాలను సందర్శించే వారికి రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి బొగత, కుంటాల, పొచ్చర జలపాతాల వరకు విహారయాత్రలను ఏర్పాటుచేసింది. ఇందుకోసం బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బొగతకు రోజూ ఉదయం 7 గంటలకు బషీర్బాగ్ నుంచి, 7:30 గంటలకు సికింద్రాబాద్లోని యాత్రీనివాస్ నుంచి బస్సు బయలుదేరి మధ్యాహ్నం లక్నవరం చేరుతుంది. అక్కడ పర్యాటకులు భోజనం ముగించుకుని బొగత జలపాతం వద్ద ఉల్లాసంగా గడుపవచ్చు. హరిత కాకతీయలో పర్యాటకుల డిన్నర్ ముగిసిన తర్వాత బస్సు రాత్రికి హైదరాబాద్ చేరుతుంది. ఈ యాత్రకు ఒక్కొక్కరికి ఏసీ బస్సుకు రూ.1,500, నాన్ఏసీ బస్సుకు రూ.1,400 చెల్లించాల్సి ఉంటుందని, భోజన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని టూరిజం కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్రావు తెలిపారు. కుంటాల, పొచ్చర జలపాతాలను సందర్శించే వారికోసం కూడా ఇంతే రుసుముతో ఈ ప్రాంతాల నుంచే బస్సులు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలను www.telanganatourism. gov.in వెబ్సైట్లో పొందుపరిచారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు