తెలుగు ప్రేక్షకులను అలరించనున్న జాన్వీ కపూర్

- July 25, 2018 , by Maagulf
తెలుగు ప్రేక్షకులను అలరించనున్న జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 'దఢక్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనలో అందర్ని ఆక్టుకుంది. దీంతో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఐతే, టాలీవుడ్ లో శ్రీదేవికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని జాన్వీని కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని ఆమె తండ్రి బోనీ కపూర్ ఆలోచిస్తున్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల నిర్మాత దిల్ రాజు తో చర్చలు కూడా జరిపారని చెప్పుకొంటున్నారు.

మరోవైపు, రాజమౌళి మల్టీస్టారర్ తో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుందని ప్రచారం జరుగుతోంది. తారక్, చరణ్ లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా జాన్వీని తీసుకొన్నారంట జక్కన్న. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లోనూ రిలీజ్ కాబోతుండటంతో.. ఇందులో నటించేందుకు జాన్వీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com