తెలుగు ప్రేక్షకులను అలరించనున్న జాన్వీ కపూర్
- July 25, 2018
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 'దఢక్' సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనలో అందర్ని ఆక్టుకుంది. దీంతో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఐతే, టాలీవుడ్ లో శ్రీదేవికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని జాన్వీని కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని ఆమె తండ్రి బోనీ కపూర్ ఆలోచిస్తున్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల నిర్మాత దిల్ రాజు తో చర్చలు కూడా జరిపారని చెప్పుకొంటున్నారు.
మరోవైపు, రాజమౌళి మల్టీస్టారర్ తో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుందని ప్రచారం జరుగుతోంది. తారక్, చరణ్ లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా జాన్వీని తీసుకొన్నారంట జక్కన్న. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లోనూ రిలీజ్ కాబోతుండటంతో.. ఇందులో నటించేందుకు జాన్వీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..