అక్రమ రవాణా: యువతిని రక్షించిన కాన్సులేట్
- July 29, 2018
దుబాయ్:19 ఏళ్ళ భారతీయ యువతిని ఇండియన్ కాన్సులేట్ రక్షించింది. పంజాబ్కి చెందిన బాధిత యువతికి సంబంధించిన సమాచారాన్ని , అదే రాష్ట్రానికి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ విషయంపై స్పందించారు. దుబాయ్ కాన్సులేట్ జనరల్ బాధిత మహిళను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. చైల్డ్ కేర్ టేకర్గా దుబాయ్లో ఉదోయగం కోసం సిమ్రన్ జీత్ కౌర్ దుబాయ్కి వచ్చి, ఇక్కడే సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తనకు మాయమాటలు చెప్పి దుబాయ్కి తీసుకొచ్చిన ఏజెంట్ని బాధితురాలు సంప్రదించినా ప్రయోజనం లేకుండాపోయింది. సిమ్రాన్ కేసుని ట్రాఫికింగ్ కేసుగా భావించి, ఆమెకు సహాయ సహకారాలు అందించారు. అజ్మన్లో ఇంత వేగంగా ఓ కేసు పరిష్కారమవడం ఇదే తొలిసారి అని అక్కడి సోషల్ వర్కర్స్ కూడా తెలిపారు. ఎట్టకేలకు ఆదివారం దుబాయ్ నుంచి అమృత్సర్కి బయల్దేరింది బాధితురాలు సిమ్రాన్.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..