ఒమన్:ఏడుగుర్ని రక్షించిన కోస్ట్గార్డ్
- August 01, 2018
ఒమన్:రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్గార్డ్, ఏడుగురు వ్యక్తుల్ని రక్షించినట్లు వెల్లడించింది. మస్కట్ మరియు నార్త్ బతినా గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వీరిని రక్షించారు. సముద్రంలో వీరు ప్రయాణిస్తున్న బోట్లు ఆగిపోవడంతో, తీవ్ర భయాందోళనలకు గురయ్యారు బాధితులు. వారిని అత్యంత చాకచక్యంగా రక్షించినట్లు కోస్ట్గార్డ్ తెలిపింది. మొత్తం నలుగుర్ని మస్కట్, నార్త్ బతినా గవర్నరేట్ పరిధిలో రక్షించగా, ముసాందామ్లో ముగ్గురు ఆసియా జాతీయుల్ని రక్షించారు. ఇదిలా ఉంటే, డీజిల్ని స్మగుల్ చేయడానికి వినియోగిస్తున్న బోటుని విలాయత్ ఆఫ్ బార్కాలో స్వాధీనం చేసుకుంది కోస్ట్ గార్డ్. సముద్రంలో బోట్లను తిప్పేవారు అప్రమత్తంగా వుండాలనీ, బోట్ల సామర్థ్యంపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని బోట్ల యజమానులకు రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..