బహ్రెయిన్:లాండ్రీమేన్ని దోచుకున్న మహిళ
- August 09, 2018
బహ్రెయిన్:ఆసియాకి చెందిన లాండ్రీ మేన్ని ఓ అరబ్ మహిళ దోచుకుంది. అతన్ని వేధింపులకు గురిచేసి, అతని వద్దనున్న వాలెంట్ని దోచుకుంది 32 ఏళ్ళ మహిళ. ఆమె ఏడుగురు పిల్లల తల్లి. ఈ కేసు విచారణలో వుంది. ఆమెపై ప్రాస్టిట్యూషన్ అభియోగాలూ మోపబడ్డాయి. నిఖబ్ ధరించిన మహిళ, తన షాప్ వద్దకు వచ్చి, మంచి నీళ్ళు అడిగిందనీ, ఆ తర్వాత బాత్రూమ్ గురించి రిక్వెస్ట్ చేసిందనీ, ఆ తర్వాత తనను గట్టిగా పట్టుకుని, అసభ్యకరంగా ప్రవర్తించి, తన వద్దనుంచి వ్యాలెట్ని దోచుకుందని, వ్యాలెట్లో 8 బహ్రెయినీ దినార్స్ వున్నాయని, ఆ తర్వాత ఆమె అక్కడినుంచి పారిపోయిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై స్పాన్సరర్కి ముందుగా తెలిపిన బాధితుడు, నిందితురాలు బలంగా వుండడంతో ఆమెను తాను నిలువరించలేకపోయానని చెప్పాడు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







