హైదరాబాద్ లో 'సైమా' కర్టెన్రైజర్
- August 12, 2018
హైదరాబాద్:సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా అవార్డ్స్(సైమా, 2018) ఏడవ వార్షికోత్సవం సెప్టెంబర్14, 15 తేదీల్లో దుబాయ్లో 'అంజన్ స్టార్ ఈవెంట్స్'సంస్థ వారు నిర్వహిస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల కళాకారులను ప్రోత్సహించే ఈ అవార్డుల వేడుకకు సంబంధించిన కర్టెన్రైజర్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. రానా దగ్గుబాటి, ప్రణీత, ప్రగ్యా జైస్వాల్, శాన్వి, శుభ్ర అయ్యప్ప, సైమా ఛైర్పర్సన్ అడుసుమిల్లి బృందాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు, కన్నడ భాషల్లో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో విజేతలకు పలు కేటగిరీల్లో హీరో రానా అవార్డులను అందజేశారు. '''సైమా ప్రారంభమై అప్పుడే ఆరేళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నా. ఈ అవార్డు ఫంక్షన్తోనే నేను యాంకర్ అయ్యా. అందుకే నాకు సైమాతో ప్రత్యేక అనుబంధం వుంది. కళాకారుడికి అవార్డ్ వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడానికి 'సైమా' చక్కని వేదిక అయింది.
న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చెయ్యడానికి ఈ ఏడాది షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించడం మంచి పరిణామం. షార్ట్ ఫిల్మ్ తీసి డిజిటల్ ప్లాట్ఫారమ్ మీద నిరూపించుకున్న చాలామంది యువత సినిమాల్లో దర్శకులుగా, ఆర్టిస్ట్లుగా రాణిస్తున్నారు'' అని రానా దగ్గుబాటి తెలిపారు. ''ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నాం. సినీ తారలను ప్రోత్సహించడానికి సైమా ఎంతో ఉపయోగపడుతుంది'' అని అడుసుమిల్లి బృందా ప్రసాద్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!