హైదరాబాద్ లో 'సైమా' కర్టెన్‌రైజర్‌

- August 12, 2018 , by Maagulf
హైదరాబాద్ లో 'సైమా' కర్టెన్‌రైజర్‌

హైదరాబాద్:సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ సినిమా అవార్డ్స్‌(సైమా, 2018) ఏడవ వార్షికోత్సవం సెప్టెంబర్‌14, 15 తేదీల్లో దుబాయ్‌లో 'అంజన్ స్టార్ ఈవెంట్స్'సంస్థ వారు నిర్వహిస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల కళాకారులను ప్రోత్సహించే ఈ అవార్డుల వేడుకకు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. రానా దగ్గుబాటి, ప్రణీత, ప్రగ్యా జైస్వాల్‌, శాన్వి, శుభ్ర అయ్యప్ప, సైమా ఛైర్‌పర్సన్‌ అడుసుమిల్లి బృందాప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు, కన్నడ భాషల్లో నిర్వహించిన షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌లో విజేతలకు పలు కేటగిరీల్లో హీరో రానా అవార్డులను అందజేశారు. '''సైమా ప్రారంభమై అప్పుడే ఆరేళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నా. ఈ అవార్డు ఫంక్షన్‌తోనే నేను యాంకర్‌ అయ్యా. అందుకే నాకు సైమాతో ప్రత్యేక అనుబంధం వుంది. కళాకారుడికి అవార్డ్‌ వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడానికి 'సైమా' చక్కని వేదిక అయింది.

న్యూ టాలెంట్స్‌ని ఎంకరేజ్‌ చెయ్యడానికి ఈ ఏడాది షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌ నిర్వహించడం మంచి పరిణామం. షార్ట్‌ ఫిల్మ్‌ తీసి డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ మీద నిరూపించుకున్న చాలామంది యువత సినిమాల్లో దర్శకులుగా, ఆర్టిస్ట్‌లుగా రాణిస్తున్నారు'' అని రానా దగ్గుబాటి తెలిపారు. ''ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నాం. సినీ తారలను ప్రోత్సహించడానికి సైమా ఎంతో ఉపయోగపడుతుంది'' అని అడుసుమిల్లి బృందా ప్రసాద్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com