హైదరాబాద్ లో సూడాన్ యువకుడు దారుణ హత్య
- August 14, 2018
హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన రాషెష్ అనే సూడాన్ యువకుడు నిన్న అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సన్సిటీ సి అండ్టి కాలనీలో ఈ ఘటన జరిగింది. రాషెష్ స్నేహితులైన అబ్దుల్లా,లిసాలతో కలసి రూంలో భోంచేసిన తర్వాత ముగ్గురి మధ్య చిన్న గొడవ మొదలైంది. అదికాస్త చిలికి చిలికి గాలివానగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అబ్దుల్లా, లిసాలిద్దరు పండ్లు కోసే కత్తితో రాషెష్ను పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దీంతో.. రాషెష్ స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అబ్దుల్లా ,లిసాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!