తాలిబన్ల నరమేధం.. 17 మంది సైనికుల హతం

- August 14, 2018 , by Maagulf
తాలిబన్ల నరమేధం.. 17 మంది సైనికుల హతం

అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌కు కూతవేటు దూరంలో ఉన్న తూర్పు ఘజని నుంచి తాలిబన్లను తరిమికొట్టాలని ప్రయత్నిస్తున్న అఫ్గాన్‌ భద్రతాదళాలకు మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పర్యబ్‌ ప్రావిన్స్‌లోని ఘోర్‌మాచ్‌ జిల్లాలో ఉన్న కీలక సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. అక్కడ కాపలా ఉన్న సైనికుల్లో 17 మంది పొట్టనపెట్టుకున్నారు. 40 మందిని బందీలుగా పట్టుకున్నారు. మరో 40 మంది తాలిబన్ల ధాటికి తట్టుకోలేక సమీప కొండల్లోకి పారిపోయారు. ఈ నర మేధంలో ఇప్పటికే 110 నుంచి 150 మంది పౌరులు చనిపోయినట్లు ఐరాస తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com