'భారత్' సినిమా కాన్సెప్ట్ టీజర్ విడుదల
- August 15, 2018
'భారత్' కాన్సెప్ట్ టీజర్ విడుదల ముంబయి: బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'భారత్'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. దిశా పటానీ సల్మాన్ సోదరిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా..ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ను సల్మాన్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. 'ఈ భూమిపై కొన్ని బంధుత్వాలు ఉంటాయి. మరికొన్ని రక్తసంబంధాలు ఉంటాయి. కానీ నాకు ఆ రెండూ ఉండేవి' అంటూ సల్మాన్ చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో సల్మాన్ ఇంతకు ముందెన్నడూ చూడని ఓ కొత్త అవతారంలో దర్శనమిస్తారని తెలుస్తోంది. భారతదేశ సంస్కృతి, మూలాలను కళ్లకుకట్టేలా 'భారత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో దర్శకుడు జాఫర్ వెల్లడించారు. ఏడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కథ సాగుతుంది. అందులో భాగంగా పలు దేశాల్లో చిత్రీకరణ జరపుతున్నారు. ఓ మనిషి, ఓ జాతి కలిసి చేసే ప్రయాణమే 'భారత్'.
వచ్చే ఏడాదిలో సల్మాన్కు బాగా కలిసొచ్చిన రంజాన్ రోజున ఈ చిత్రం విడుదలకానుంది
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!