కేరళకు కేసీఆర్ సాయం
- August 17, 2018
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. భారీవర్షాలు, వరదలతో తల్లడిల్లిపోతోన్న కేరళకు ఆపన్న హస్తం అందించారు. 25 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి అందజేయాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్ కే జోషీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నగదుతోపాటు 2.5 కోట్ల రూపాయలు విలువచేసే 10 రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ కేరళకు పంపించబోతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కేరళ పునర్నిర్మాణానికి ప్రజలంతా తమవంతు సాయం చేయాలని, కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ఒక ఫొటోని పోస్ట్ చేశారు కేటీఆర్.
ఇలాఉండగా, ఈ నెల 8 నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కేరళలోని14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు కేరళలో ఇప్పటివరకు వర్షాలు, వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్యల 324కు చేరింది. ఒక్క బుధవారం రోజునే 100 మంది మృత్యువాత పడ్డారు. 2 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అళపుజ, ఎర్నాకుళం, త్రిసూర్, పథనాంతిట్ట ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.
గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకోవడంతో.. కేరళలో అపార నష్టం వాటిల్లింది. ఇంకా వరుణుడి తన ప్రకోపాన్ని చాటుతున్న క్రమంలో నష్టం విలువను కూడా అంచనా వేయలేకపోతున్నారు. 30 బ్రిడ్జిలు కూలిపోగా, లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్