కేరళకు కేసీఆర్ సాయం
- August 17, 2018
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. భారీవర్షాలు, వరదలతో తల్లడిల్లిపోతోన్న కేరళకు ఆపన్న హస్తం అందించారు. 25 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి అందజేయాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్ కే జోషీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నగదుతోపాటు 2.5 కోట్ల రూపాయలు విలువచేసే 10 రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ కేరళకు పంపించబోతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కేరళ పునర్నిర్మాణానికి ప్రజలంతా తమవంతు సాయం చేయాలని, కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ఒక ఫొటోని పోస్ట్ చేశారు కేటీఆర్.
ఇలాఉండగా, ఈ నెల 8 నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కేరళలోని14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు కేరళలో ఇప్పటివరకు వర్షాలు, వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్యల 324కు చేరింది. ఒక్క బుధవారం రోజునే 100 మంది మృత్యువాత పడ్డారు. 2 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అళపుజ, ఎర్నాకుళం, త్రిసూర్, పథనాంతిట్ట ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.
గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకోవడంతో.. కేరళలో అపార నష్టం వాటిల్లింది. ఇంకా వరుణుడి తన ప్రకోపాన్ని చాటుతున్న క్రమంలో నష్టం విలువను కూడా అంచనా వేయలేకపోతున్నారు. 30 బ్రిడ్జిలు కూలిపోగా, లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్







