జెట్ఎయిర్వేస్ అప్
- August 17, 2018ముంబై: ఇటీవల ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసిక ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు వచ్చిన వార్తలతో విమానయాన రంగ ప్రైవేట్ సంస్థ జెట్ఎయిర్వేస్ కౌంటర్ బలపడింది. ప్రస్తుతం ఎన్ఎస్ఇలో ఈ షేరు 1.6 శాతం పెరిగి రూ.305 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.309వద్ద గరిష్టాన్నీ, రూ.303 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ నెల 27న బోర్డు సమావేశంకానున్నట్లు జెట్ఎయిర్వేస్ స్టాక్ ఎక్ఛేంజీలకు తెలియచేసింది. కాగా, భాగస్వామ్య సంస్థ జెట్ ప్రివిలేజ్లో వాటాను పిఇ దిగ్గజం బ్లాక్స్టోన్కు విక్రయించనున్న సమాచారంలో గురువారం కూడా జెట్ఎయిర్వేస్ కౌంటర్ లాభపడిన సంగతి విదితమే. జెట్ ఎయిర్వేస్ వాటాకు రూ.3000నుంచి 4000కోట్ల వరకూ లభించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..