'ఫ్రైడే 'సినిమా ప్రారంభం
- August 18, 2018
శ్రీ మీనాక్షి మూవీస్ పతాకంపై కెఎస్ఆర్ డాన్స్ అకాడమీ సమర్పణలో నిర్మాత కె.సత్యరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఫ్రైడే.. కిషన్ కెకె హీరోగా పరిచయం అవుతున్న ఈచిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా ప్రారంభమైంది.. తెలంగాణ మంత్రి హరీష్రావు తొలిసన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.. సి. కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కెమెరా స్విచ్చాన్ చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు..
అనంతంర చిత్ర దర్శకుడు దాసరి లారెన్స్ మాట్లాడారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్టోరీతో చిత్రం ఉంటుందన్నారు. హీరో పోలీస్ు ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని తెలిపారు. మంచి కథతో ముందుకు వస్తున్నామన్నారు . హీరో కిషన్ మాట్లాడుతూ, ఈచిత్రానికి ప్రొడ్యూసర్ సత్యారెడ్డిగారే స్క్రిప్టు అందించారన్నారు..
దాదాపు ఏడాదిపాటు స్క్రిప్టుపై కష్టపడి పనిచేశారన్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, బేబీ మీనాక్షి ఇందులో లీడ్రోల్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో నిర్మాత సత్యరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్ సెప్టెంబర్ 5నుంచి మొదలుపెట్టనున్నామని తెలిపారు. కొత్త కథ అందులో క్రైమ్ జోనర్లో చాలా బాగావచ్చిందన్నారు.
అందరికీ నచ్చుతుందన్నారు. కార్యక్రమంలో హీరోయిన్లు కశ్మీర, సుమన పూజారి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!