రాహుల్ అధ్యక్షతన వార్రూమ్లో కీలక సమావేశం
- August 18, 2018
ఢిల్లీ: రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వార్రూమ్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల ఇన్చార్జ్లు హాజరయ్యారు. రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, కేరళలో సహాయక చర్యలపై కాంగ్రెస్ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ పెద్ద దోపిడీ దారుడని మండిపడ్డారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణను ఫణంగా పెట్టి రిలయన్స్ కంపెనీకి దోచిపెట్టారని అన్నారు. బీజేపీ అవినీతిని బయటపెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాఫెల్ కుంభకోణంపై అక్టోబర్లో కరపత్రాలను పంచుతామని రఘువీరా తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!