భారత వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి..
- August 18, 2018భారత వాతావరణ శాఖ అంచనాలే నిజమయ్యాయి.. ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాధారణానికి మించి వర్షాలు పడుతున్నాయి. సీజన్ మొదట్లో ఊరించి ఉసూరుమనిపించిన మేఘాలు మళ్లీ కుంభవృష్టి కురిపిస్తున్నాయి. జులై రెండో వారం నుంచి మొదలైన వర్షాలు ఇప్పటికీ కురుస్తూనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుడపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి.
నైరుతి రుతుపవనాలు ఉత్తరాది నుంచి వెనక్కు రావడం మొదలైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా, ఏపీపై నైరుతి రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పారు. నేడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సీజన్లో మంచి వర్ష పాతం నమోదవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బంగ్లా-ఒడిశా తీరాలకు ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయన్నారు.
ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండ్రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్