అమెరికాలో తెలుగు వాసి మృతి

- August 19, 2018 , by Maagulf
అమెరికాలో తెలుగు వాసి మృతి

అమెరికాలో మరో తెలుగు వాసి మృతి చెందాడు. పశ్చిమగోదావరి దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామానికి చెందిన బోళ్ల వీర వెంకట సురేష్(35) మృతి చెందాడు. సురేష్ చెన్నైలో బీటెక్ పూర్తి చేసి అక్కడే కొంతకాలం పని చేశాడు. అనంతరం హైదరాబాద్ లోని టీసీఎస్ సంస్థలో పని చేసాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి మేరీల్యాండ్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ ఆదివారం ఉదయం కారులో సురేష్ చనిపోయి ఉన్నాడు. స్నేహితులు సురేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కొడుకు మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే సురేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com