ఒకే రోజు మూడు సినిమాలు...
- August 26, 2018ఈ వినాయక చవితి కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరమంచి పోటీనే నెలకొని ఉంది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా రెండు సినిమాల విషయంలో ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఆ రెండే సమంత నటిస్తున్న యూ టర్న్ మూవీ కాగా , మరోటి నాగ చైతన్య శైలజా రెడ్డి.
వాస్తవానికి శైలజా రెడ్డి ఆగస్టు 31 న విడుదల అవ్వాల్సి ఉండగా , రీ రికార్డు పనులు పూర్తి కాకపోయేసరికి సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 07 న అనుకున్నప్పటికీ ఆ రోజు మూడు నాల్గు సినిమాలు ఉండడం తో నిర్మాతలు ఆ రోజు కాకుండా సెప్టెంబర్ 13 వినాయక చవితి రోజయితే బాగుంటుందని ఆ తేదీని ఫిక్స్ చేసారు. ఇక ఆరోజు చైతు తో సమంత యూ టర్న్ తో పోటీ పడుతుంది. ఈ రెండు సినిమాలే కాదు సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' చిత్రం కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో మొత్తం మీద ఈ మూడు చిత్రాల మధ్య మాత్రం విపరీతమైన పోటీ ఉండనుంది. మరి ఈ మూడిట్లో ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..