త్వరలో మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు:డీఆర్డీవో చైర్మన్
- August 26, 2018
DRDO ఛైర్మన్గా తెలుగు వ్యక్తయిన డాక్టర్ సతీష్ రెడ్డి నియమించింది కేంద్రం. సతీష్ ఇప్పటికే రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన DRDOకి చైర్మన్ అయిన సతీష్రెడ్డిది నెల్లూరు జిల్లా. హైదరాబాద్ JNTUలోనే ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 1985లో DRDOలో చేరారు. హైదరాబాద్ సెంటర్కు డైరెక్టర్గానూ బాధ్యతలు నిర్వహించారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీల్లో విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఆయన సేవలకు, సమర్థతకు గుర్తింపుగా ఇప్పుడు DRDO చైర్మన్ బాధ్యతలు సతీష్రెడ్డికి అప్పగించింది కేంద్రం. సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామంటున్న సతీష్రెడ్డి, త్వరలో మనం మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు వాటిని అందించే స్థాయికి ఎదగాలన్న టార్గెట్తో పనిచేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి