ఇండియా:డ్రోన్ల వినియోగం ఇక చట్టబద్ధం
- August 27, 2018
న్యూఢిల్లీ: డ్రోన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పలు నియమ నిబంధనలను ప్రకటించింది. ఈమేరకు వచ్చే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డ్రోన్ల వినియోగం చట్టబద్ధం కానున్నది. డ్రోన్లను వ్యవసాయం, ఆరోగ్యం, విపత్తు సహాయ పనుల్లో వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించేందుకు కేంద్రం అనుమతించింది. ఆహార పదార్థాలు, సరుకుల రవాణాకు డ్రోన్ల వినియోగాన్ని అనుమతించబోమని ప్రభుత్వం సోమవారం తెలిపింది. సాధారణ పౌరులు డ్రోన్లను పగటిపూట మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. కంటిచూపు మేర అనగా 450 మీటర్ల ఎత్తుకు మించి వాటిని ఎగురనీయరాదని పేర్కొంది. నానో డ్రోన్లు, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, కేంద్ర నిఘా సంస్థలు ఉపయోగించే డ్రోన్లకు తప్ప మిగిలిన వాటన్నింటికీ ప్రత్యేక గుర్తింపు నంబర్ (యూఐఎన్) కేటాయిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం డ్రోన్లు విమానాశ్రయాల పరిసరాలు, అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో, తీర ప్రాంతాలలో, రాష్ట్ర సచివాలయ ప్రాంగణాలలో ఎగురకూడదు. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేశ్ప్రభు సోమవారం డ్రోన్ల నిబంధనలను ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో డ్రోన్ల మార్కెట్ లక్ష కోట్ల డాలర్లకు చేరవచ్చని చెప్పారు. పెండ్లిళ్ల ఫొటోగ్రఫీలో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు లేవని మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







