అబ్రాజ్‌ సీఈఓపై క్రిమినల్‌ కేసు ఉపసంహరణ

- August 28, 2018 , by Maagulf
అబ్రాజ్‌ సీఈఓపై క్రిమినల్‌ కేసు ఉపసంహరణ

యూ.ఏ.ఈ:అబ్రాజ్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఆరిఫ్‌ నక్వి - క్రిసెంట్‌ గ్రూప్‌ ఫౌండర్‌ హుమిద్‌ జాఫర్‌ మధ్య ఒప్పందం కుదిరిందని న్యాయవాదులు పేర్కొన్నారు. 798 మిలియన్‌ దిర్హామ్‌లకు సంబంధించి చెక్‌ బౌన్స్‌ కేసులో ఈ రాజీ కుదిరింది.హమిద్‌ని రిప్రెజెంట్‌ చేస్తోన్న అల్‌ తమిమి అండ్‌ కంపెనీ పార్టనర్‌ జాఫెర్‌ ఓగ్లి మాట్లాడుతూ, నక్వికి వ్యతిరేకంగా క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అబ్రాజ్‌ చీఫ్‌, గతంలో జాఫర్‌కి జారీ చేసిన చెక్‌, సరైన నిధులు లేక బౌన్స్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో క్రిమినల్‌ చర్యల వరకు వెళ్ళింది వ్యవహారం. అయితే ఇరు వర్గాలూ కూర్చుని, సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. అంతకు ముందు న్యాస్థానం ఈ కేసులో ఆరిఫ్‌ నక్వికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com