అధికారులకు ఓలా, ఉబర్లే గతి
- August 31, 2018
కర్ణాటక ప్రభుత్వం త్వరలో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇకపై ఓలా, ఉబర్ లాంటి టాక్సిల్లో ఆఫీసుకు వచ్చి వెళ్లాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు ఉపయోగించే ప్రైవేటు కార్ల స్థానంలో ఓలా, ఉబర్ లాంటి యాప్ బేస్డ్ టాక్సీలు వాడుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రైవేటు కార్లతో విపరీతమైన ఖర్చు అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కార్ల స్థానంలో ఓలా, ఉబర్ కార్లను అద్దెకు తీసుకుంటే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రతి సంవత్సరం అధికారుల ప్రైవేటు కార్ల కోసం సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని పర్సనల్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. అన్ని డిపార్ట్ మెంట్ల అధికారుల కోసం దాదాపు 500 అద్దె కార్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్క కారుకు నెలకు రూ.25,000 అద్దె చెల్లిస్తున్నారు. ప్రతి వాహనం 8 గంటలే షిప్ట్ లో ఉంటుంది. 80 కి.మీ. మాత్రమే తిరుగుతుంది. ఒక వేళ ఎక్కువ సమయం ఉండాల్సి వస్తే... గంటకు రూ.40 అదనంగా చార్జ్ చేస్తారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రైవేటు కార్ల స్థానంలో అద్దెకార్లు వాడుకునేవిధంగా ఏర్పాట్లు చేయనుంది. అధికారులను ఇంటి నుంచి తీసుకురావటం, తిరిగి డ్రాప్ చేసి వచ్చే విధంగా ఒప్పందం చేసుకోకున్నారు. త్వరలో దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







