ఏటీఎం బూత్లోకి దూసుకెళ్ళిన కారు: ఇద్దరికి గాయాలు
- September 01, 2018
మోటరిస్ట్ ఒకరు తాను నడుపుతున్న వాహనంపై అదుపు కోల్పోవడంతో ఆ వాహనం దుబాయ్లోని ఓ మాల్ వద్దనున్న ఏటీఎం బూత్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. బుర్జుమాన్ షాపింగ్ సెంటర్ వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏటీఎం బూత్లో ఐదుగురు వున్నట్లు తెలుస్తోంది. ఫోర్ వీల్ డ్రైవ్ కారు ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం అందగానే, అక్కడికి పోలీసులు చేరుకున్నారు. 40 ఏళ్ళ వయసున్న ఆసియాకి చెందిన డ్రైవర్ కారు నడుపుతున్నట్లు గుర్తించారు. మరో కారు అడ్డంగా రావడంతో తాను బ్రేక్ వేసే క్రమంలో, పొరపాటున యాక్సిలరేటర్పై కాలు మోపడంతో ప్రమాదం జరిగిందని ఆ కారుని నడుపుతున్న వ్యక్తి పోలీసులకు తెలిపారు. విచారణ జరిపిన పోలీసులు, వాహనాన్ని నడిపిన వ్యక్తి ఆల్కహాల్గానీ డ్రగ్స్గానీ తీసుకోలేదనీ, మొబైల్ ఫోన్ని సైతం ఆ సమయంలో వినియోగించలేదని తెలిపారు. నిర్లక్ష్యం, వాహనం నడుపుతున్న సమయంలో సరిగ్గా దృష్టిపెట్టకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని లెఫ్టినెంట్ కల్నల్ అల్ కాసిమ్ చెప్పారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..