ప్రమాదంలో కేరళ చేపలమ్మాయి..
- September 03, 2018
కేరళ:కేరళలో చేపల్లమ్ముతూ వరద బాధితులకు తన వంతు సహాయాన్ని అందించి సోషల్ మీడియాలో పాపులర్ అయిన చేపలమ్మాయి హనన్ హమీద్ (21) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హసన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న(సోమవారం) హసన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన స్తంభాన్ని డీకొట్టింది.. దీంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు గమనించి హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇడుక్కిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో హనన్ బీయస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. తన కాలేజీ ఫీజుల కోసం, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆమె కాలేజీకి వెళ్లొచ్చి.. ఖాళీగా ఉన్న సమయంలో చేపలు అమ్మేది. ఆ వచ్చిన ఆదాయంతోపాటు తనకు సహాయంగా ఇచ్చిన కొంత డబ్బును కేరళ వరద బాధితులకు ఇచ్చి మంచి మనుసును చాటుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!