కోల్ కతాలో ఘోర ప్రమాదం

- September 04, 2018 , by Maagulf
కోల్ కతాలో ఘోర ప్రమాదం

పశ్చిమబెంగాల్ : రాజధాని కోల్ కతాలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ కోల్ కతాలోని పురాతన మజర్ హట్ వంతెన రైల్వే ట్రాక్ పై కుప్పకూలింది. బస్సులు, కార్లు వంతెనపై పయనిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ఘటనపై విచారణకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com