టీఆర్ఎస్ ‘ప్రజల ఆశీర్వాద సభ’ బాధ్యతలు వీరికే
- September 04, 2018తెలంగాణ:అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేసి గవర్నర్కు పంపిన మర్నాటి నుంచి ప్రజల్లోకి వెళ్లబోతోంది TRS. 50 రోజుల్లో 100 ప్రాంతాల్లో సభలు పెట్టేందుకు రూట్మ్యాప్ రెడీ చేసుకుంది. హుస్నాబాద్ మొదటి నుంచి కేసీఆర్కు సెంటిమెంట్ ఉన్న ప్రాంతం కావడంతో.. ఈసారి కూడా అక్కడి నుంచే ప్రచారం మొదలుపెడుతున్నారు. 7వ తేదీన “ప్రజల ఆశీర్వాద సభ”లకు శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా విజయవంతం కావడంతో ఆ సెంటిమెంట్ కొనసాగించనున్నారు.
మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్ సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాల నుంచి ప్రజల్ని సభకు తీసుకు వచ్చేందుకు ఏం చేయాలన్న దానిపై స్థానిక నేతలతో చర్చించారు. చిగురుమామిడి మండలం బాధ్యతలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి అప్పగించారు. సైదాపూర్ మండలానికి సమన్వయకర్తగా మంత్రి ఈటల ఉంటారు. కోహెడ నుంచి జన సమీకరణ బాధ్యతను మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చూసుకుంటారు. అక్కన్నపేటకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, భీమరదేవరపల్లికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ఎల్కతుర్తికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, హుస్నాబాద్ పట్టణం, గ్రామీణ ప్రాంతానికి మంత్రి హరీశ్రావు, కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్, పాతూరి సుధాకర్రెడ్డి పర్యవేక్షకులుగా పనిచేయనున్నారు. నియోజకవర్గం మొత్తం నుంచి 60 నుంచి 70 వేల మందిని సభకు తీసుకురావాలన్నది TRS ప్లాన్.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!