పడవ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. 26 మంది గల్లంతు..
- September 05, 2018
గువాహటిలో దారుణం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 26 మంది గల్లంతు అయినట్లు సమాచారం. తీరం నుంచి 200 మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.పడవలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఓ స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో పడవ రెండు ముక్కలైంది. కొందరు ప్రయాణికులు ఈదుతూ సురక్షితంగా బయటకు రాగలిగారు. గల్లంతు అయిన వారికోసం రాష్ట్ర విపత్తు స్పందన దళం సహాయక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!