అమెరికాలోని బ్యాంకులో జరిపిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి మృతి

- September 06, 2018 , by Maagulf
అమెరికాలోని బ్యాంకులో జరిపిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి మృతి

న్యూయార్క్‌ : అమెరికాలోని ఒక బ్యాంక్‌లో గురువారం ఒక దుండగుడు జరిపిన కాల్పుల ఘటనలో గుంటూరుకు చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సిన్సినాటిలోని ఫౌంటైన్‌ స్క్వేర్‌కు సమీపంలోని ఒక బ్యాంకును దోచుకునేందుకు దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన పృథ్వీరాజ్‌ కెండెపి (26) మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పృథ్వీ బ్యాంకులో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారని తానా అధికారి పేర్కొన్నారు. లూయిస్‌ కార్డోలెస్‌, రిచర్డ్‌లు ఈ ఘటనలో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం జరిపిన పోలీస్‌ కాల్పుల్లో దుండగుడు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, దుండగుడు గతంలో అదే బ్యాంకులో పనిచేశాడని వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com