ఇండియాలో డ్రైవర్ రహిత ట్రాక్టర్ ఆవిష్కరణ

- September 07, 2018 , by Maagulf
ఇండియాలో డ్రైవర్ రహిత ట్రాక్టర్ ఆవిష్కరణ

ఎస్కార్ట్‌ లిమిటెడ్‌ డ్రైవర్ రహిత ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయానికి సాంకేతికతను జోడించే ప్రయత్నంలో భాగంగా ఆటోమేటెడ్‌ ట్రాక్టర్‌ను గురువారం ఆవిష్కరించింది. డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్‌ను ఆపరేట్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌, రిలయన్స్‌ జియో, ట్రింబుల్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో జతకట్టినట్లు పేర్కొంది. సంస్థ ఎండీ నిఖిల్‌ నందా మాట్లాడుతూ ఈ స్మార్ట్‌ ట్రాక్టర్‌ దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులు చేస్తుందని తెలిపారు. రెండేళ్లలో అధిక సంఖ్యలో ఈ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com