విద్యను బోధించనున్న ప్రణబ్ ముఖర్జీ
- September 08, 2018
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంతులు అవతారం ఎత్తనున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) విద్యార్థులకు భారత్ లో సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై పబ్లిక్ పాలసీ మీద ఆయన పాఠాలు బోధిస్తారు. 22 సెషన్లుగా ఉండే ఈ కోర్సులో ప్రణబ్ కనీసం 12 క్లాసులు తీసుకుంటారని ఐఐఎం-ఏ తెలిపింది. అయితే ఇందుకోసం ఆయనకు గౌరవ వేతనం ఉంటుందా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. అయితే
1)కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ సోషియో ఎకనామిక్ ఇంక్లూసివిటీ: థియరీ అండ్ పార్లమెంటరీ ప్రాక్టీస్,
2) పాలసీ అండ్ ఇనిస్టిట్యూషనల్ ఇంటర్వెన్షన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్: ఎ లెగసీ టు బి బిల్ట్ అపాన్,
3) ఆర్టికులేటింగ్ పాలసీ అండ్ ఇనిస్టిట్యూషనల్ ఎజెండా ఫర్ ఫ్యూచర్ ట్రాన్స్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియా
అనే అంశాల మీద ప్రణబ్ క్లాసులుంటాయి.
గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఇక్కడే పాఠాలు బోధించారు. అదే ఒరవడిని ప్రణబ్ కొనసాగించనున్నారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు 1963 వరకు కూడా కోల్ కటాలోని విద్యాసాగర్ కాలేజీలో ప్రణబ్ పొలిటికల్ సైన్స్ బోధించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి