హైపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం: ఐదుగురికి గాయాలు
- September 10, 2018
మస్కట్: సుల్తానేట్ క్యాపిటల్లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం కారణంగా ఐదుగురు గాయాలపాలయ్యారని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడి) పేర్కొంది. హైపర్ మార్కెట్ కిచెన్ ఏరియాలో తొలుత అగ్ని కీలలు మొదలయ్యాయని పిఎసిడిఎ వెల్లడించింది. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్సను అందించారు. ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపు చేశారనీ, కిచెన్ చిమ్నీ నుంచి మంటలు వ్యాపించాయని విలాయత్ ఆఫ్ బౌషెర్లోని అల్ ఘుబ్రా ఏరియాలో ఈ ప్రమాదం జరిగిందని, పొగ పీల్చడం వల్ల ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని పిఎసిడిఎ వివరించింది.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









