నిర్మాత డబ్బులు ఎగ్గొట్టాడు.. కోర్టుకు ఎక్కిన టాప్ హీరో..
- September 14, 2018మొన్నటికి మొన్న తమిళ్ హీరో శింబు రూ.50లక్షలు అడ్వాన్స్ తీసుకుని షూటింగ్కి రాకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆ చిత్ర నిర్మాత కోర్టుని ఆశ్రయించాడు. ఇప్పుడు మరో కేసు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్. నిర్మాత ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని హీరో అరవింద్ స్వామి కోర్టుకి ఎక్కారు. చదురంగవేట్టై-2 అనే సినిమాలో హీరోయిన్ త్రిషతో కలిసి నటించారు అరవింద్ స్వామి. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత మనోబాలా ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందంలో కొంత డబ్బు బాకీ రూ.1.79 కోట్లు చెల్లిచాల్సి ఉంది. ఎన్ని సార్లు అడిగినా దాటవేస్తున్నారు నిర్మాత మనోబాలా. వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లాల్సి వస్తుందన్నా ఏ మాత్రం స్పందించలేదు. దీంతో తమకు ఇవ్వాల్సిన మొత్తంతో పాటు 18 శాతం వడ్డీ కూడా చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు అరవింద్ స్వామి. ఈ విషయమై సెప్టెంబర్ 20 లోపు కోర్టుకు నిర్మాత వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మనోబాలకు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి