లాంగ్ టెర్మ్ రెసిడెన్స్ వీసాపై హర్షం
- September 17, 2018యూఏఈలోని వలసదారులు, రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం యూఏఈలో వుండేందుకు వీలుగా యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఐదేళ్ళ రెసిడెన్స్ వీసాకి సంబంధించి నిబంధనలు ఇలా వున్నాయి. 55 ఏళ్ళకు పైబడ్డవారికి ఐదేళ్ళకుగాను ప్రత్యేక పరిస్థితుల్లో వీసాని మంజూరు చేస్తారు. వలసదారుడు ఖచ్చితంగా 2 మిలియన్ దిర్హామ్ల విలువైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ కలిగి వుండాలి. 1 మిలియన్ లేదా అంతకు మించి సేవింగ్స్ వుండాలి. 20,000 దిర్హామ్ల కంటే ఎక్కువగా యాక్టివ్ ఆదాయం కలిగి వుండాలి. ఈ మూడింటిలో ఏది కలిగి వున్నా, వారికి ఐదేళ్ళ కాలానికి రెసిడెన్సీ వీసా దక్కుతుంది. దశాబ్దాలుగా యూఏఈలో నివసిస్తున్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుందని రాయల్ ఆర్కిడ్ గ్రూప్ ఓనర్ వినయ్ వర్మ చెప్పారు. 17 ఏళ్ళుగా తాను యూఏఈలో నివసిస్తున్నాననీ, తమకు ఈ నిర్ణయం ఎంతో ఆనందాన్నిచ్చిందని లైన్ ఇన్వెస్టిమెంట్ డైరెక్టర్, లులు గ్రూప్ ఎక్స్ప్రెసెస్ వజీబ్ అల్ ఖౌరి చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..