నేడు భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్..
- September 18, 2018
దుబాయ్: దాదాపు 14 నెలల తర్వాత... క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్న ఓ ఉత్కంఠ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. చరిత్ర.. గణాంకాలు.. రికార్డులు.. రివార్డులు.. విశ్లేషణలు.. విమర్శలు.. భావోద్వేగాలు.. వీటన్నింటిని పక్కనబెడితే మ్యాచ్ను చూస్తే చాలు అనుకునే అభిమానగణం ఆనందోత్సాహాల్లో తేలియాడే అపురూపమైన క్షణాలకు సమయం ఆసన్నమైంది. విజయబావుటకు, ఓటమిబాటకు అతి స్వల్ప తేడా ఉండే అత్యుత్తమ సమరానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో.. బుధవారం ఆసియా కప్లో భాగంగా జరిగే గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్లో భారత్.. పాక్తో అమీతుమీ తేల్చుకోనుంది. పేపరు మీద చూస్తే ఇరుజట్లు బలంగానే కనిపిస్తున్నా.. మైదానంలో అసలు సిసలు ఆట ఎవరూ ఆడుతారన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. గతేడాది చాంపియన్స్ ట్రోఫీలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తుంటే.. చరిత్రను పునరావృతం చేస్తామని దాయాది జట్టు ధీమాతో ఉంది. ఎన్ని విశ్లేషణలు చేసినా.. ఎన్ని రకాలుగా మాట్లాడినా.. నిజాయితీగా భారత్ బ్యాటింగ్ బలానికి, పాక్ బౌలింగ్ బలగానికి మధ్య జరిగే అత్యంత కఠిన పరీక్ష ఇది. ఇందులో ఎవరు నెగ్గుతారో.. ఎవరు తగ్గుతారో చూడాలి..!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!