200 దిర్హామ్‌ల కంటే తక్కువకే ఇండియాకి ప్రయాణం

- September 19, 2018 , by Maagulf
200 దిర్హామ్‌ల కంటే తక్కువకే ఇండియాకి ప్రయాణం

ఇండియాకి వెళ్ళేందుకోసం అతి తక్కువ ధరకే విమాన ఛార్జీలు లభ్యమవుతాయని ఎదురుచూసేవారికి శుభవార్త. యూఏఈ ఎయిర్‌లైన్స్‌ ఒకటి, ఢిల్లీ, జైపూర్‌, కోచి, కోజికోడ్‌, ముంబై, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు 169 దిర్హామ్‌లకే ప్రయాణించేందుకు వీలు కలుగుతోంది. బహ్రెయిన్‌, కరాచీ, కువైట్‌, మస్కట్‌, సలాలా వంటి ప్రాంతాలకు 199 దిర్హామ్‌లకే టిక్కెట్లు లభ్యమవుతాయి. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, హ్యాండ్‌ బ్యాగేజ్‌ ఓన్లీ డీల్‌ ఫేర్‌ ఆఫర్‌ని అబుదాబీ, బహ్రెయిన్‌, కువైట్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, అజర్‌బైజాన్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఈజిప్ట్‌ తదితర ప్రాంతాలకు విమాన ప్రయాణాన్ని ఆఫర్‌ చేస్తోంది. 29 సెప్టెంబర్‌లోగా ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకుని, 4 సెప్టెంబర్‌ నుంచి 31 మార్చి 2019 వరకు ప్రయాణించొచ్చు. అబుదాబీ నుంచి బహ్రెయిన్‌ ప్రయాణానికి 813 దిర్హామ్‌లకు, కువైట్‌కి 973 దిర్హామ్‌లకు ప్రయాణించొచ్చు. వీక్లీ సేవర్స్‌ పేరుతో ఎకానమీ క్లాస్‌ ప్రయాణీకులకు లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్‌ని ఐదు రోజుల పాటు అందుబాటులో వుంచారు. ఈ వీక్‌ ఆఫర్‌ కింద బీరట్‌, కరాచి, బ్యాంకాక్‌, రియో డిజనీరో, సాఓ పాలో మరియు పలు ప్రాంతాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com