తెలంగాణ:ఎన్ఆర్ఐలకూ రైతు బంధు పథకం వర్తింపు
- September 22, 2018
తెలంగాణ:ప్రవాస భారతీయ భూ యజమానులకు శుభవార్త. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పెట్టుబడి కోసం రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి రాయితీ ఎన్ఆర్ఐలకు వర్తింపజేసేందుకు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. 2018-19 ఖరీఫ్ సీజన్ ఆరంభంలో తెలంగాణలో నివసించే రైతులకు మాత్రమే రైతు బంధు పెట్టుబడి రాయితీ సొమ్ము చెక్కుల రూపంలో అందజేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సమయంలో ఎన్ఆర్ఐలు స్వయంగా భారత్ రావడం కష్టమైంది. ఈక్రమంలో విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయు భూ యజమానులైన రైతులకు చెక్కుల పంపిణీ విషయంలో ప్రభుత్వంఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఎన్ఆర్ఐ కుటుంబాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణకు చెందిన దాదాపు 60వేల మంది వరకు అమెరికా, గల్ఫ్,ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండవచ్చని అంచనా వేసిన వ్యవసాయశాఖ అర్హులైన ఎన్ఆర్ఐలందరికీ రైతు బంధు పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి