మావోయిస్టుల ఘాతుకం..ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతి

- September 23, 2018 , by Maagulf
మావోయిస్టుల ఘాతుకం..ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతి

విశాఖ జిల్లా డుంబ్రీగూడ మండలం తొట్టంగి వద్ద మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. దాడి సమయంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ ఉన్నారు. మావోయిస్టుల ఘాతుకానికి సర్వేశ్వరరావుతో పాటు సివేరు సోమ కూడా మృతి చెందారు. దాడిలో 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి వస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. ఇద్దరిని అతి సమీపం నుంచి కాల్చిచంపినట్లు సమాచారం. మావోయిస్టుల దాడితో కిడారి, శివేరి సోమ స్పాట్‌లోనే మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com