ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ను కడిగేసిన ఇండియా

- September 30, 2018 , by Maagulf
ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ను కడిగేసిన ఇండియా

ఐక్య రాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది పాకిస్థాన్‌ను కడిగిపారేసింది ఇండియా. ఇదేనా కొత్త పాకిస్థాన్ అంటూ ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వాన్ని ఏకిపారేసింది. 2014లో పెషావర్‌లోని సైనిక స్కూల్‌పై జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ ఉందన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషీ విమర్శలను తిప్పికొట్టింది. మీ నీచమైన ఆరోపణలు ఆ దాడిలో చనిపోయిన అమాయక చిన్నారులను అవమానించేవే అని స్పష్టంచేసింది. మానవ హక్కులపై ప్రపంచానికి ఉపన్యాసాలు ఇచ్చే ముందు మీ దేశం సంగతి చూసుకోండి అంటూ ఓ స్థాయిలో దులిపేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com