కోల్‌కతాలో బాంబు పేలుడు

- October 02, 2018 , by Maagulf
కోల్‌కతాలో బాంబు పేలుడు

కల్‌కత్తా లో ఈ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధి కాజిపార ప్రాంతంలోని ఓ పండ్ల దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. మొదటగా గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని భావించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అది సిలిండర్ పేలుడు కాదని తేల్చారు. ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బ్లాస్టింగ్ జరిగిన చోట విచారణ జరుపుతున్నారు.

డమ్ డమ్ మున్సిపాలిటి ఛైర్మన్ పంచూ రాయ్ బిల్డింగ్ లోనే ఈ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తనను అంతం చేసేందుకే ప్రత్యర్ధులు బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు పంచూ రాయ్ ఆరోపిస్తున్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేసిన దాడి అంటున్నారాయన. టీఎంసీ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యర్ధి పార్టీలు దాడులకు తెగబడుతున్నాయంటూ పరోక్షంగా RSSపై ఆరోపణలు చేశారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com