కోల్కతాలో బాంబు పేలుడు
- October 02, 2018
కల్కత్తా లో ఈ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధి కాజిపార ప్రాంతంలోని ఓ పండ్ల దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. మొదటగా గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని భావించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అది సిలిండర్ పేలుడు కాదని తేల్చారు. ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బ్లాస్టింగ్ జరిగిన చోట విచారణ జరుపుతున్నారు.
డమ్ డమ్ మున్సిపాలిటి ఛైర్మన్ పంచూ రాయ్ బిల్డింగ్ లోనే ఈ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తనను అంతం చేసేందుకే ప్రత్యర్ధులు బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు పంచూ రాయ్ ఆరోపిస్తున్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేసిన దాడి అంటున్నారాయన. టీఎంసీ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యర్ధి పార్టీలు దాడులకు తెగబడుతున్నాయంటూ పరోక్షంగా RSSపై ఆరోపణలు చేశారాయన.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి