శబరిమల వివాదం: కదం తొక్కుతున్న కేరళ
- October 06, 2018
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రజల మనోభావాలు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలంటూ కేరళ వ్యాప్తంగా నిరసనలు చేపట్టుతున్నారు అక్కడి ప్రజలు.
ఇటీవలే కేరళ సీఎం పి. విజయన్ శబరిమల తీర్పుపై స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేదిలేదంటూ ప్రకటించారు. తమ ప్రభుత్వం శబరిమల సందర్శించే మహిళలకు సౌకర్యాలు, రక్షణ కల్పిస్తుందని అన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో సున్నితమైన ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని అధికార, విపక్ష పార్టీలు నిర్ణయించాయి.
అటు కేరళలోని కొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు కోర్టు తీర్పును వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన, ర్యాలీల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంతో ఏ సంబంధం లేని మహిళలు చేసిన పిటీషన్కు సుప్రీం కోర్టు అనుమతించడం, దీన్ని స్థానిక ప్రభుత్వమూ స్వాగతించడం సరికాదని మహిళలు పేర్కొన్నారు. అటు కొట్టాయంలో శబరిమల ప్రధాన పూజారి కే రాజీవరు మాట్లాడుతూ సంప్రదాయాలు, సంస్కృతులను పరిరక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఉమ్మడిగా ఉద్యమించాలన్నారు.
మరోవైపు తిరువనంతపురంలో ట్రావెన్కోర్ దేవాలయం బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద కొందరు అయ్యప్ప స్వామి భక్తులు ధర్నా చేపట్టారు. దీనిపై రాష్ట్ర మంత్రి కే సురేంద్రన్ మాట్లాడుతూ.. ఈ విషయమై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ అధికార సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీజేపీ ఆరెస్సెస్కు నిజంగా ఈ అంశంపై చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంటులో శాసనం తేవాలని ఆయన కోరారు. శబరిమల అయప్పస్వామి ఆలయ సంప్రదాయాలను గౌరవించి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు పునఃసమీక్షించుకోవాలని విశ్వహిందూ పరిషత్ కోరింది. కాగా ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ధర్మకర్తలు సోమవారం ముఖ్యమంత్రి పి. విజయన్ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారని సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి