గూగుల్ ప్లస్ మూసివేత
- October 08, 2018
వాషింగ్టన్ : ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్.. తనకు చెందిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్ను మూసివేయనున్నది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఆ సంస్థ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 5 లక్షల మంది యూజర్ల డేటా చోరీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గూగుల్ ప్లస్ను మూసివేసేందుకు నిర్ణయించారు. గూగుల్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ బెన్ స్మిత్ ఈ విషయాన్ని చెప్పారు. ప్రాజెక్టు స్ట్రోబ్ కింద గూగుల్ చేపట్టిన సెర్చ్లో టెక్నికల్ బగ్ను గుర్తించారు. గూగుల్ ప్లస్లో బగ్ వచ్చినట్లు ఆ సంస్థ ఆరునెలల క్రితమే గుర్తించింది. గూగుల్ సీఈవో సుందర్ దీనిపై సమీక్ష నిర్వహించారు. మార్చ్ నెలలోనే ఆ సాఫ్ట్వేర్ బగ్కు విరుగుడు కనుగున్నారు. కానీ ఆ లోపు 5 లక్షల అకౌంట్ల సమాచారం బయటకు వెళ్లిపోయింది. అయితే ఆ డేటా మాత్రం ఎటువంటి హానికి గురికాలేదు అని గూగుల్ వెల్లడిస్తున్నది. కాగా, గూగుల్ ప్లస్ను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో మాతృ సంస్థ అల్పాబెట్ షేర్లు పడిపోయాయి. షేర్లు 1.5 శాతం పడిపోయాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







