కామాంధులకు బలైన మహిళా జర్నలిస్టు

- October 08, 2018 , by Maagulf

 

రూస్: బల్గేరియాలో ఓ మహిళా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురైంది. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రూస్ పట్టణంలో జరిగింది. మారినోవా ఓ ఛానల్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. యురోపియన్ యూనియన్ నిధుల్లో జరిగిన అవకతవకలపై ఆమె గత కొన్నాళ్లూగా కథనాలను రాస్తోంది. అయితే ఆమె మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ మారినోవా తలకు భారీ గాయాలు అయ్యాయి. ఊపిరి ఆడక ఆమె మృతిచెందినట్లు కూడా డాక్టర్లు తేల్చారు. హత్య చేయడానికి ముందు ఆ జర్నలిస్టును రేప్ చేశారని స్థానిక మీడియా పేర్కొన్నది. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడవ ఘటన. బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్‌లో మారినోవా పనిచేస్తున్నది. ఓ సైకియాట్రీ సెంటర్ వద్ద ఆమె మృతదేహం ఉన్న కారణంగా.. అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com