ఇరాన్ నుండి చమురు దిగుమతులు కొనసాగించనున్న భారత్
- October 08, 2018
న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ నవంబర్లో ఇరాన్ నుండి భారత్ చమురు దిగుమతిని కొనసాగిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఇరాన్ నుండి చమురు దిగుమతిలో ప్రధానమైనదిగా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దారునిగా భారత్ ఉందని అన్నారు. 2017-18లో భారత్ దిగుమతి చేసుకున్న 220.4 మిలియన్ మెట్రిక్ టన్నుల (మిలియన్ టన్నుల) ముడి చమురులో ఇరాన్ వాటా 9.4 శాతంగా ఉంది.' మన దేశీయ అవసరాలు తీరాలి. ఇప్పటికే నవంబర్లో చమురు దిగుమతి కోసం తమ కంపెనీలు వాటి కోటా కోసం నామినేట్ అయ్యాయి' అని ప్రధాన్ తెలిపారు. 'ప్రపంచ నేతలు మా అవసరాలను అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం' అని ఢిల్లీలోని ఎనర్జీ ఫోరంలో ఆయన అన్నారు. నవంబర్ 4 నుండి ఇరాన్ చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. గతవారం ఎక్సైజ్డ్యూటీ, ఇంధన ధరల తగ్గింపు మాట్లాడుతూ ఇవి చమురు ధరలను నియంత్రించలేవని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!